కలం, వరంగల్ బ్యూరో: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలో 60.62కోట్ల నిధులతో నిర్మించిన 1-132/33 కేవి, 6-33/11కేవి విద్యుత్ సబ్ స్టేషన్లను ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రారంభించారు. డిప్యూటీ సీఎం వెంట స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, మామిడాల యశస్విని రెడ్డి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రో పాషా, కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, జనగామ డీసీసీ అధ్యక్షులు లకావత్ ధన్వంతి, తదితరులు పాల్గొన్నారు.

