బంగ్లాదేశ్‌లో న‌దిలో మునిగిన బ‌స్సు.. 18 మంది దుర్మ‌ర‌ణం

క‌లం, వెబ్ డెస్క్‌: బంగ్లాదేశ్‌ (Bangladesh)లో ఘోర బ‌స్సు ప్ర‌మాదం చోటు చేసుకుంది. రాజ్‌బరి జిల్లా దౌలత్‌డియా టెర్మినల్ వద్ద బుధ‌వారం సాయంత్రం ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న‌ ఒక బస్సు పద్మా నదిలో పడిపోయింది. ఈ ప్ర‌మాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈద్ సెలవులు ముగించుకొని సుమారు 40 మంది ప్రయాణికులతో ఢాకాకు వెళ్తున్న ఈ బస్సు నౌక ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు నదిలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, కోస్ట్‌గార్డ్ సిబ్బంది 6 గంటల పాటు శ్రమించి అర్థరాత్రి త‌ర్వాత‌ బస్సును వెలికితీశారు. బస్సు లోపల 14 మృతదేహాలు లభించగా, అంతకుముందే న‌లుగురి మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 11 మంది ప్రయాణికులు న‌దిలో నుంచి ఈదుకుంటూ సురక్షితంగా బయటపడ్డారు. మ‌రి కొంద‌రు నీటిలోనే గల్లంతయ్యారు. మృతుల్లో చాలా మంది ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను పర్యవేక్షించడమే కాకుండా ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>