కలం, వెబ్ డెస్క్: మేడ్చల్ కోర్టులో బండి భగీరథ్ (Bandi Bhagirath) కేసుకు సంబంధించిన విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో భాగంగా బాధితురాలి స్టేట్మెంట్ను కోర్టు తాజాగా మరోసారి రికార్డ్ చేసింది. ఇప్పటికే రెండు సార్లు ఆమె స్టేట్మెంట్ను నమోదు చేసినప్పటికీ, న్యాయస్థానం మూడోసారి కూడా వివరాలను సేకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పాటు బాధితురాలి తల్లి స్టేట్మెంట్ను కూడా కోర్టు రికార్డ్ చేసి, ఈ కేసు విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో పోక్సో కేసులో మేడ్చల్ కోర్టు (Medchal Court) ఎలాంటి తీర్పు ప్రకటించనుందనే విషయమై ఉత్కంఠ నెలకొంది.

