Mobile Popup Ad
Mobile Popup Ad

అంతా నఖ్వీనే చేశాడు: బంగ్లాదేశ్​

కలం, స్పోర్ట్స్​ : టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడం వెనుక అసలు కారణంగా పాకిస్థాన్ బోర్డు చైర్మన్ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. మాజీ బోర్డు అధికారి వ్యాఖ్యలతో ఈ వివాదం మరోసారి వెలుగులోకి వచ్చింది. మాజీ కార్యదర్శి అశ్రాఫుల్ హక్ (Ashraful Haque) అభిప్రాయం ప్రకారం, బంగ్లాదేశ్ తీసుకున్న నిర్ణయంపై బయటి ప్రభావం ఉందని తెలిపారు. ముఖ్యంగా మొహ్సిన్ నఖ్వీ.. అమీనుల్ ఇస్లాం‌ను ప్రభావితం చేసి భారత్‌కు వెళ్లకూడదనే వైఖరీని ప్రకటించేలా ఒప్పించినట్టు ఆయన పేర్కొన్నారు. చివరికి ఈ నిర్ణయం బంగ్లాదేశ్‌కే నష్టంగా మారిందని సూచించారు.

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భారత్‌లో మ్యాచ్‌లు ఆడబోమనే నిర్ణయాన్ని కొనసాగించింది. ఐసీసీ పలుమార్లు చర్చలు జరిపినా ఆ నిర్ణయం మారలేదు. దీంతో బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఐసీసీ ఓటింగ్ సమయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బంగ్లాదేశ్‌కు మద్దతు ఇచ్చింది. మ్యాచ్‌లను భారత్ వెలుపల నిర్వహించాలని సూచించినా ఆ ప్రతిపాదన ఆమోదం పొందలేదు. భారత్ మ్యాచ్ బహిష్కరిస్తామని ప్రకటించిన పాకిస్థాన్ చివరికి ఆ మ్యాచ్ ఆడింది.

ఐపీఎల్‌లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆడలేకపోవడాన్ని కారణంగా చూపుతూ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని మాజీ అధికారి అభిప్రాయపడ్డారు. ఆ నిర్ణయం తొందరపాటుగా తీసుకున్నదని పేర్కొన్నారు. ఈ పరిణామాల మధ్య భారత్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనపై అనిశ్చితి కొనసాగుతోంది. ఆ సిరీస్ జరగకపోతే బోర్డుకు ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకున్నప్పటికీ ఐసీసీ నుంచి కఠిన చర్యలు లేకపోవడం కూడా చర్చకు దారి తీసింది. మొత్తం వ్యవహారం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>