Mobile Popup Ad
Mobile Popup Ad

గాయం నుంచి కోలుకుని అదరగొట్టిన మెస్సీ

కలం, వెబ్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్ 2026 గురువారం నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ ప్రపంచకప్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా 3-0 తేడాతో ఐస్‌లాండ్‌ను ఓడించింది. గాయం తర్వాత మైదానంలోకి వచ్చిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి (Messi)  అద్భుతమైన గోల్‌తో మెరిశాడు. మ్యాచ్ ప్రారంభంలో ఐస్‌లాండ్ గోల్ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. ఆ వెంటనే పుంజుకున్న అర్జెంటీనా తరఫున ఎనిమిదో నిమిషంలో వాలెంటిన్ బార్కో మొదటి గోల్ చేసి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. దీంతో మొదటి హాఫ్ ముగిసే సమయానికి అర్జెంటీనా 1-0తో ముందంజలో నిలిచింది. రెండో హాఫ్‌లో అర్జెంటీనా కోచ్ జట్టులోకి ముగ్గురు సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లను తెచ్చారు.

ఆ తర్వాత కొద్దిసేపటికే స్టార్ ప్లేయర్ మెస్సి కూడా మైదానంలోకి అడుగుపెట్టాడు. వచ్చిన వెంటనే మెస్సి ఇచ్చిన పాస్‌తో లౌటారో మార్టినెజ్ పెనాల్టీని సాధించాడు. 72వ నిమిషంలో ఈ పెనాల్టీని మెస్సి గోల్‌గా మార్చి అర్జెంటీనా ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. ఇది అతనికి 117వ అంతర్జాతీయ గోల్. చివరిగా 86వ నిమిషంలో థియాగో అల్మాడా మరో గోల్ చేయడంతో అర్జెంటీనా 3-0తో విజయం సాధించింది. ఈ గెలుపుతో అర్జెంటీనా జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రపంచకప్‌ బరిలోకి దిగుతోంది. జూన్ 16న అల్జీరియాతో జరిగే మ్యాచ్‌తో అర్జెంటీనా తన టైటిల్ డిఫెన్స్‌ను ప్రారంభించనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>