కలం, డెస్క్ : ఏపీలో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ (Liquor Scam) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న వాసుదేవరెడ్డిని (Vasudeva Reddy) సిట్ ఆఫీసర్లు అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకెళ్లారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వాసుదేవరెడ్డి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వ్యవహరించారు. వాసదేవరెడ్డి అరెస్ట్ తో ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చలు మొదలయ్యాయి. ఆయనను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా మరింత మందిని విచారించే ఛాన్స్ ఉంది.
Read Also: తెలుగు సత్తా ఏంటో బిల్స్ గేట్స్కు చూపించాం: కేఏ పాల్
Follow Us On : WhatsApp


