కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (APSCHE) నిర్వహించిన ఏపీ లాసెట్, పీజీఎల్సెట్ 2026 (AP LAWCET 2026) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలకు మొత్తం 23,996 మంది విద్యార్థులు హాజరుకాగా, 19,197 మంది అర్హత సాధించారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 80 శాతంగా నమోదైంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అర్హత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
విద్యార్థులు తమ ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్సైట్ (https://cets.apsche.ap.gov.in/LAWCET) ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలు పొందే అవకాశం కల్పించారు. ఫలితాలు విడుదల కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులలో ఆనందం నెలకొంది. అర్హత సాధించిన వారికి అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

