కలం, వెబ్ డెస్క్ : కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఆరుగురు జూనియర్ ఐపీఎస్ (AP IPS Transfers) అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు మార్కాపురం ఓఎస్డీ ( అడ్మిషన్) గా నవజ్యోతి మిశ్రాను, రాజమహేంద్రవరం అదనపు ఎస్పీగా ప్రతిల్ దేవ్ రాజ్ ను, పోలవరం ఓఎస్డీగా మందా జవాలి అల్ఫోన్స్, అమరావతిలో ఓఎస్టీగా మనోజ్ రామనాథ్ హెగ్డేను, పల్నాడు అదనపు ఎస్సీగా రోహిత్ కుమార్ చౌదరి, నంద్యాల ఏఎస్పీగా సుస్మితకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. వీరు తక్షణమే వారి బాధ్యతలలో చేరాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

