కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 అభ్యర్థులకు హైకోర్టు (AP High Court) బిగ్ రిలీఫ్ ఇచ్చింది. గ్రూప్ 2 (APPSC Group 2) సర్వీసెస్ రిజర్వేషన్ల మీద దాఖలైన పిటిషన్లను డిస్మిస్ చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ లో మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు, క్రీడాకారులకు రిజర్వేషన్లకు సంబంధించి ప్రత్యేక రోస్టర్ పాయింట్లపై 2023లో దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు మంగళవారం విచారించింది. ఈ మేరకు పిటిషన్లను రద్దు చేస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది.
నోటిఫికేషన్ లో హారిజాంటల్ రిజర్వేషన్ పాయింట్లు కేటాయించడం చట్టవిరుద్ధమంటూ నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. 2025 ఫిబ్రవరి 20న జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి పిటిషన్లు కొట్టివేశారు. పరీక్ష ఫెడ్యూల్ ప్రకారమే జరగవచ్చని, ఫలితాలు మాత్రం పెండిగ్ లో ఉన్న ప్రధాన పిటిషన్ల తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేశారు. ఈ క్రమంలో మరోసారి ఆ అనుబంధ పిటిషన్లపై నేడు విచార చేపట్టిన హైకోర్టు (AP High Court) వాటిని కోట్టివేస్తూ ఆదేశాలు జారిచేసింది.
Read Also: ఏపీలో 28 జిల్లాలు.. 82 రెవెన్యూ డివిజన్లు
Follow Us On: Instagram


