ఏపీలో పలువురు మున్సిపల్ కమిషనర్లు బదిలీ

కలం, వెబ్ డెస్క్: ఏపీలో 16 మంది పురపాలక సంస్థలు, నగర పంచాయతీల కమిషనర్లను (Municipal Commissioners) రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. నగరపాలక సంస్థల్లో జోనల్‌ కమిషనర్లు, ద్వితీయ, తృతీయ శ్రేణి పురపాలక సంస్థల్లో కమిషనర్లు వీరిలో ఉన్నారు. గతంలో బదిలీ అయి పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సందర్భంగా అవకాశం కల్పించారు. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం వీరిని బదిలీచేశారు. ప్రస్తుతం విజయవాడ మున్సిపల్ కమిషనరేట్ లో జోనల్ కమిషనర్ గా ఉన్న రమ్య కీర్తనను నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ గా నియామకమయ్యారు. దర్శి మున్సిపల్ కమిషనర్ గా అర్జునరావు, పులివెందుల మున్సిపల్ కమిషనర్ మునికుమార్, ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్గా సుభాష్ చంద్రబోస్, తెనాలి మున్సిపాలిటీ అసిస్టెంట్ కమిషనర్ గా రామారావు, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సౌత్ జోనల్ కమిషనర్గా ప్రసాదరావు, గుంటూరు మున్సిపాలిటీ అడిషనల్ కమిషనర్ గా మల్లయ్య నాయుడు నియమితులయ్యారు. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని సురేశ్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>