కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) అక్కడ ప్రముఖ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin)ను కలిశారు. విమానాశ్రయంలోని లాంజ్లో సీఎం చంద్రబాబు ఎంపీలతో కలిసి కాసేపు ప్రత్యేకంగా సమావేశమై వివిధ అంశాలపై చర్చిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో విమానాశ్రయంలో ఉన్న క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ముఖ్యమంత్రి అక్కడ ఉన్నారనే విషయం తెలుసుకుని ఆయనను కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ కాసేపు ముచ్చటించారు.


