epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

భారత వ్యతిరేక ఆందోళనల కేంద్రంగా ఢాకా యూనివర్సిటీ

కలం, వెబ్​డెస్క్​: బంగ్లాదేశ్​లో భారత వ్యతిరేక నిరసనలు (Anti India protests), నినాదాలు ఆగడం లేదు. ఈసారి ఇవి ఏకంగా ఢాకా యూనివర్సిటీలోకి అడుగుపెట్టాయి. అల్లరిమూకలు భారత వ్యతిరేక ఆందోళనలకు డాకా (Dhaka) విశ్వవిద్యాలయాన్ని కేంద్రంగా మార్చేశాయి. శుక్రవారం భారీ సంఖ్యలో ఆందోళనకారులు ఈ వర్సిటీలో ఆందోళనకు దిగారు. భారత వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ ఆందోళనలను ‘ఇంక్విలాబ్​ మాంచో’ మద్దతుదారులు ముందుండి నడిపించారు. భారత్​కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు ‘ఐ యామ్​ హాది’ (నేను హాదీని) అని స్లోగన్స్​ చేశారు. భారత్​కు బద్ధ వ్యతిరేకి, ‘ఇంక్విలాబ్​ మోంచో’ విద్యార్థి నాయకుడు షరీఫ్​ ఉస్మాన్​ హాది హంతకులను త్వరగా పట్టుకొని, ఉరితీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

హాది హంతకులు దేశాన్ని విడిచి పారిపోయారని, దీనికి భారత్​ సాయం చేసిందంటూ మరికొందరు ఆందోళన చేశారు. కాగా, యూనివర్సిటీలో ‘మధుర్​’ క్యాంటీన్​ను కొందరు ఆందోళనకారులు ధ్వంసం చేశారు. బంగ్లా విమోచన పోరాటంలో మధుసూదన్​ డే అనే హిందూ నేత ప్రాణాలర్పించారు. ఈ క్యాంటీన్​ ఆయన స్థాపించిందే. దీనిపై కొందరు రాళ్లు రువ్వారు. క్యాంటీన్​లోని కుర్చీలు, టేబుళ్లు విరగ్గొట్టారు. ‘క్యాంటీన్​’ను బాయ్​కాట్​ చేయాలంటూ పిలుపునిచ్చారు. దీనిపై క్యాంటీన్​ యజమానులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డగించారు.

Read Also: అతడి మరణానికి కెనడాదే బాధ్యత: భారత్​

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>