epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఏఐసీసీ స్క్రీనింగ్​ కమిటీలో అనిల్​ కుమార్​ యాదవ్ కు చోటు

కలం, వెబ్​ డెస్క్​ : పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్​ అధిష్టానం ఆయా రాష్ట్రాలపై ఫోకస్​ పెంచింది. రాబోయే ఎన్నికల్ల గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకు సంబంధించి ఆల్​ ఇండియా కాంగ్రెస్​ కమిటీ (AICC) స్క్రీనింగ్​ కమిటీలను నియమించింది. అందులో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన కమిటీలో తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు అనిల్​ కుమార్​ యాదవ్ (Anil Kumar Yadav) కు అవకాశం లభించింది.

ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్​ ప్రకటన జారీ చేశారు. కాగా.. కేరళ, అస్సాం, తమిళనాడు, పాండిచెర్రి, పశ్చిమ బెంగాల్​ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే కాంగ్రెస్​ అధిష్టానం ఇవాళ స్క్రీనింగ్​ కమిటీలను నియమించింది.

Read Also: భోగాపురం ఎయిర్ పోర్టు ట్రయల్ రన్ కు రెడీ..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>