కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో విభిన్న వాతావరణం ఉంది. ఒకవైపు ఎండలు దంచికొడుతుంటే.. మరోవైపు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తుల శాఖ పేర్కొంది. రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షం పడే ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ (Weather Alert ) చేసింది. బంగాళ ఖాతం మీదుగా ఉపరిత ఆవర్తనం కొనసాగుతుండగా రాయసీమ పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ ఆవర్తనాల ప్రభావంతో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది.
ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు తేలికపాటి వర్ష సూచన చేసింది. అలాగే దక్షిణాంధ్ర ప్రాంతాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని సూచించింది. ఈ పరిస్థితుల్లో పొలాల్లో పనిచేసే రైతులు అప్రమత్తంగా ఉండాలని అప్రమత్తం (Weather Alert) చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారమరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి. కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు.

