కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా సత్యవేడు శ్రీసిటీలోని ఈ ప్యాక్ పరిశ్రమలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం అక్కడ భారీగా మంటలు ఎగిసిపడుతుండగా.. ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుంది. ప్రస్తుతం ఫైర్ ఇంజన్ల సాయంతో సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

