పశ్చిమాసియాలో యుద్ధం సాగుతున్న వేళ.. అమెరికా (America) చర్య ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. అమెరికా అత్యంత పవర్ ఫుల్ అణ్వాయుధ పరీక్ష చేసింది. కాలిఫోర్నియా తీరంలోని వాండెన్ బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఈ టెస్ట్ చేసింది అమెరికా. మినిట్ మ్యాన్ 3ని అమెరికా మరోసారి పరీక్షించింది. స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఐ ల్యాండ్స్ లో నిర్దేశించిన లక్ష్యాన్ని సక్సెస్ ఫుల్ గా ఇది ఛేదించిందని అమెరికా స్పేస్ ఫోర్స్ వెల్లడించింది. ఈ వెపన్ లోని ప్రతి విభాగం శక్తిని తెలుసుకునేందుకు ఈ టెస్ట్ చేసినట్టు అమెరికా స్పేస్ ఫోర్స్ తెలిపింది.
అయితే ఓ వైపు ఇరాన్ తో యుద్ధం జరుగుతున్న సమయంలో అమెరికా (America) ఈ టెస్ట్ చేయడంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అధునాతన ఆయుధాలను ఇరాన్ మీద ప్రయోగిస్తామని ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటలకే ఈ టెస్ట్ జరగడం అనుమానాలకు తావిస్తోంది. ఈ మినిట్ మ్యాన్-3 అత్యంత పవర్ ఫుల్. నిముషాల్లోనే లక్ష్యాన్ని ఛేదించేస్తుంది. 5వేల మైళ్ల దాకా గంటలో ప్రయాణించగలదు. అతిపెద్ద అణుబాంబులను ఇది మోసుకెళ్లగలదు.

