కలం, డెస్క్ : ఏపీలో వరుస గంజాయి (Ganja) పట్టివేతలు కలకలం రేపుతున్నాయి. చాలా చోట్ల పెద్ద ఎత్తున గంజాయి నిల్వలను పట్టుకుంటున్నారు పోలీసులు. తాజాగా అల్లూరి జిల్లాలో (Alluri District) కోటి రూపాయల విలువైన గంజాయిని పట్టుకున్నారు. ఒడిశా నుంచి చెన్నైకి గంజాయి తరలిస్తుండగా కొయ్యూరు మంప పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద ఉన్న 182 కేజీల గంజాయి, అశోక్ లేలాండ్ వెహికల్, స్కూటీ, 4 సెల్ ఫోన్లు పోలీసులు సీజ్ చేశారు.
Read Also: హైదరాబాద్లో రూ.కోటి విలువైన ఆభరణాలు చోరీ..
Follow Us On : WhatsApp


