రైతుల సమస్యలే ప్రాధాన్యం.. నరసయ్యకు పొన్నం కీలక సూచనలు

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమితులైన ఆకుల నరసయ్య (Akula Narsaiah) శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), ప్రభుత్వ విప్ విజయ రమణారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు నరసయ్యకు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆకుల నరసయ్య మంత్రి పొన్నం, విప్ విజయ రమణారావును శాలువాలతో సత్కరించారు.

అలాగే మాజీ ఎమ్మెల్సీ టి.సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌ను నరసయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేతలు మాట్లాడుతూ.. కరీంనగర్ మార్కెట్ కమిటీకి మంచి పేరు తీసుకురావాలని ఆకుల నరసయ్యకు సూచించారు. మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు అండగా నిలవాలని పేర్కొన్నారు. అన్ని రకాలుగా వారి సమస్యలు తీరుస్తూ ఆదుకునేందుకు ముందుండాలని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>