మొరాకో ఇంటర్నేషనల్ సిరీస్‌లో అదరగొట్టిన అజీతేష్

క‌లం, వెబ్ డెస్క్: యూఎస్డీ 2 మిలియన్ల ప్రైజ్‌మనీ గల ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ సిరీస్ మొరాకో గోల్ఫ్ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు అజీతేష్ సంధు (Ajeetesh Sandhu) అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్నారు. రెండో రౌండ్ ముగిసే సమయానికి భారతీయుల్లో ఆయనే అగ్రస్థానంలో నిలిచారు. ఒక బోగీ కూడా లేకుండా 3-అండర్ 70 స్కోరు సాధించిన సంధు, మొత్తం 4-అండర్ స్కోరుతో సంయుక్తంగా 25వ స్థానానికి చేరుకున్నారు. మొదటి రౌండ్‌లో 72 స్కోరు చేసిన అజీతేష్ సంధు, రెండో రౌండ్‌లో ఐదో, 11వ, 12వ హోల్స్‌లో బర్డీలు సాధించి ఎక్కడా పట్టు కోల్పోకుండా ఆడారు.

మరోవైపు భారత స్టార్ ఆటగాడు గగన్‌జీత్ భుల్లర్ 74 స్కోరుతో వెనుకబడి సంయుక్తంగా 47వ స్థానానికి పడిపోయారు. పదిగో హోల్ నుండి ఆట ప్రారంభించిన భుల్లర్, వరుసగా నాలుగు బర్డీలు సాధించినప్పటికీ కొన్ని తప్పుల వల్ల వెనుకబడ్డారు. కరణ్‌దీప్ కోచ్చర్ సైతం 72-72 స్కోరుతో భుల్లర్‌తో కలిసి అదే స్థానంలో నిలిచారు. ఈ ముగ్గురు భారత ఆటగాళ్లు మాత్రమే కటాఫ్ దాటి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు. కాగా, ఎస్ఎస్‌పీ చౌరాసియా, అనిర్బన్ లాహిరి, షౌర్య భట్టాచార్య ఒక్క షాట్ తేడాతో కటాఫ్ కోల్పోగా, రషీద్ ఖాన్, ఆర్యన్ రూపా ఆనంద్, ఉదయన్ మానేలు కూడా టోర్నీ నుండి త్వరగానే నిష్క్రమించారు.

మరోవైపు అంతర్జాతీయ స్టార్ ఆటగాడు, రెండుసార్లు మాస్టర్స్ ఛాంపియన్ అయిన బుబ్బా వాట్సన్ అద్భుత ఆటతీరుతో థాయిలాండ్‌కు చెందిన పవిత్ తంగ్కమోల్‌ప్రెసెర్ట్‌తో కలిసి లీడర్‌బోర్డ్‌లో అగ్రస్థానాన్ని పంచుకున్నారు. వాట్సన్ ఈ రోజు అత్యంత తక్కువగా 7-అండర్ పార్ 66 స్కోరు చేయగా, పవిత్ 3-అండర్ పార్ 70 స్కోరుతో రాణించారు. వీరిద్దరూ మొత్తం 11-అండర్ 135 స్కోరుతో ముందంజలో ఉన్నారు. వీరి తర్వాత కొరియాకు చెందిన యంగ్‌హాన్ సాంగ్ 10-అండర్ స్కోరుతో రెండో స్థానంలో నిలిచారు.

Read Also: ఆసియా స్పోర్ట్స్‌లో సింధు, సాత్విక్-చిరాగ్‌కు ఛాన్స్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>