కలం, వెబ్ డెస్క్: తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో రేపు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్ హీరో అజిత్ కుమార్ (Actor Ajith Kumar) బెల్జియం (Belgium) నుంచి చెన్నై(Chennai) కి తిరిగి వచ్చారు. షూటింగ్స్, రేసింగ్ పోటీలతో విదేశాల్లో బిజీగా ఉన్న ఆయన తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు చెన్నైకి చేరుకున్నారు. రేపు చెన్నైలోని తిరువన్మియూర్ నియోజకవర్గంలో ఆయన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. విదేశాల్లో ఉన్నా తన కర్తవ్యాన్ని విస్మరించకపోవడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: అమ్మవారికి నకిలీ వెండి నాణేలు.. కొత్త మోసం!
Follow Us On: Instagram

