కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయాల్లో ఓ సామాన్య మహిళ సంచలనం సృష్టించారు. ఇళ్లలో పాత్రలు కడుగుతూ నెలకు కేవలం రూ.2,500 సంపాదిస్తూ జీవనం సాగించేది కలితా మాఝీ (Kalita Majhi). ఈమె పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు. ఒకవైపు పనిమనిషిగా తన విధులను నిర్వహిస్తూనే, మరోవైపు దీక్షతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అత్యంత పేదరికంలో ఉండి కూడా ప్రజాప్రతినిధిగా ఎన్నికై విజయం సాధించింది. ప్రజాస్వామ్యంలో సామాన్యుల శక్తికి నిదర్శనంగా నిలుస్తూ దేశవ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకుంటోంది.

