కలం, వెబ్ డెస్క్ : ఆఫీసులు, పబ్లిక్ ప్లేసుల్లో మహిళల కోసం వాష్ రూమ్ సౌకర్యాలు అంత మెరుగ్గా ఉండవు. దీంతో కొందరు మహిళలు మూత్రవిసర్జన చేయకుండా ఆపుకుంటారు. అయితే, తరచూ యూరిన్ కంట్రోల్ చేసుకోవడం వల్ల ఓ 28 ఏళ్ల కార్పొరేట్ మహిళ ఉద్యోగి (Women Died)మరణించారు. ఈ విషయాన్ని ఒక డాక్టర్ సోషల్ మీడియా వేదికగా వీడియో ద్వారా వెల్లడించారు. ఆఫీస్ ప్రయాణంలో మూత్రం ఆపుకోవడం ద్వారా ఆమెకు తీవ్రమైన యూరినరీ ట్రాక్ట్ ఇన్షెక్షన్ సోకినట్లు చెప్పారు. చికిత్స కోసం హాస్పిటల్ కు వచ్చేసరికే పరిస్థితి దిగజారిపోయిందని.. కేవలం నిర్లక్ష్యం వల్లే ఈ విషాదం జరిగిందన్నారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.


