కలం, వెబ్డెస్క్: విదేశీ పౌరులు గడువు ముగిసిన వెంటనే అమెరికాను వదిలి వెళ్లాలని ఇండియాలోని యూఎస్ ఎంబసీ (US Embassy in India) స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం ‘ఎక్స్’ వేదికగా కీలక పోస్ట్ చేసింది. విదేశీయులు అమెరికాలో ప్రవేశించినప్పుడు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్(సీబీపీ) అధికారులు ఐ–94 పత్రం జారీ చేస్తారు. ఇందులో ఎన్ని రోజులు ఉండాలని అనుమతి ఇస్తారో అదే అసలైన గడువు. ఇది ముగిసిన వెంటనే అమెరికాను వీడాలని యూఎస్ ఎంబసీ పేర్కొంది. వీసా గడువు ప్రకారం అమెరికాలో ఉండడం కుదరదని స్పష్టం చేసింది. కాగా, ట్రంప్ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ చట్టాలను కఠినతరం చేస్తున్న సమయంలో యూఎస్ ఎంబీసీ పోస్టు ప్రాధాన్యం సంతరించుకుంది.
Read Also: ఒమన్తో ఒప్పందం రెండు దేశాలకూ కొత్త శక్తి: ప్రధాని మోదీ
Follow Us On: Sharechat


