epaper
Friday, January 16, 2026
spot_img
epaper

బంగ్లాలో భారత హై కమిషన్​పై దాడికి యత్నం​

కలం, వెబ్​డెస్క్​: బంగ్లాదేశ్​లో భారత వ్యతిరేక శక్తులు బుధవారం ఇండియన్​ హై కమిషన్ (Indian High Commission) ​పై దాడికి యత్నించాయి. గుంపుగా వచ్చిన రాడికల్​ గ్రూపులు భారత హై కమిషన్​ కార్యాలయం వద్ద బారికేడ్లను దాటుకొని లోపలికి వెళ్లడానికి ప్రయత్నించాయి. బంగ్లాదేశ్​కు వీసాల జారీని భారత్​ నిలిపివేయడంతో ఆందోళనకారులు హై కమిషన్​ను చుట్టుముట్టారు. భారత్​కు వ్యతిరేకంగా నినాదాలు, ఈశాన్య రాష్ట్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఢిల్లీ అలర్ట్​ అయ్యింది. దాడి ఘటనపై వివరణ కోరుతూ బంగ్లా హై కమిషనర్​ రియాజ్​ హబీబుల్లాను పిలిపించి సమన్లు ఇచ్చింది. బంగ్లాదేశ్​లో పరిస్థితిపై భారత విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

మరోవైపు, భారత హై కమిషన్​ (Indian High Commission)పై రాడికల్​ గ్రూపుల ​దాడికి యూనస్​ సర్కార్​ మద్దతిచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో.. ఉగ్రవాదుల బెదిరింపులు, బంగ్లాదేశ్​ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, భద్రతా సమస్యల కారణంగా ఢాకాలోని ఇండియన్​ వీసా దరఖాస్తు కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేసింది. పరిస్థితి చక్కబడ్డాక తిరిగి తెరవనున్నట్లు ప్రకటించింది. కాగా, కొన్ని రోజుల నుంచి బంగ్లాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు ఎక్కువయ్యాయి. ఆ దేశ తాత్కాలిక సారథి మహ్మద్​ యూనస్​తోపాటు మరికొందరు ప్రభుత్వాధికారులు, ఆర్మీ ఆఫీసర్లు భారత్​పై, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.

Read Also:  తెలంగాణ విద్యుత్ రంగంలో మైలురాయి.. లిఫ్ట్ ఇరిగేషన్, మిషన్ భగీరథపై ప్రత్యేక శ్రద్ధ!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>