epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రాహు, కేతు దోషాల నివారణకు సింపుల్ ట్రిక్ !

కలం డెస్క్: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో గ్రహాల స్థితులు వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. తొమ్మిది గ్రహాల్లో చాయా గ్రహాలుగా పిలువబడే రాహు, కేతు ముఖ్యమైనవిగా భావిస్తారు. జాతకంలో ఈ రెండు గ్రహాలు అనుకూల స్థానాల్లో లేకపోతే రాహు–కేతు దోషం(Rahu Ketu Dosha) ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు.

ఈ దోషం ఉన్నవారికి జీవితంలో అనేక అడ్డంకులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య ఇబ్బందులు, మానసిక ఆందోళనలు, కుటుంబ కలహాలు ఎదురయ్యే అవకాశముంటుందని నమ్మకం. ముఖ్యంగా పితృదోషంతో కలిసినప్పుడు రాహు–కేతు దోష ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

అమావాస్యనాడు పితృ తర్పణాలు

రాహు–కేతు దోష(Rahu Ketu Dosha) నివారణకు అమావాస్య రోజు పితృ తర్పణాలు ఇవ్వడం ఉత్తమమని సూచిస్తున్నారు. దీని ద్వారా పితృ దేవతల ఆశీస్సులు లభిస్తాయని, పితృదోషాలు తగ్గుతాయని విశ్వసిస్తారు. ఈ సందర్భంగా సత్ బ్రాహ్మణులకు అన్నదానం చేయడం, నువ్వులు, బెల్లం, నల్లని వస్త్రాలు దానం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయని పండితుల అభిప్రాయం.

దేవతారాధనతో శాంతి

రాహు, కేతు గ్రహాల శాంతికి శివుడు, హనుమంతుడు, గణపతి, కనకదుర్గమ్మలను భక్తిశ్రద్ధలతో ఆరాధించాలని సూచిస్తున్నారు. హనుమాన్ చాలీసా పారాయణం, సహస్రనామ స్తోత్రాల పఠనం చేయడం ద్వారా దోష ప్రభావం తగ్గుతుందని చెబుతున్నారు. రాహుకాల సమయంలో ఆవు నెయ్యితో దీపారాధన చేయడం ప్రత్యేక ఫలితాలను ఇస్తుందని నమ్మకం.

ధ్యానం, మంత్ర జపం ప్రాముఖ్యత

ప్రతిరోజూ ధ్యానం, యోగ, ప్రార్థన చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. రాహు–కేతు గ్రహాలకు సంబంధించిన మంత్రాలు, నవగ్రహ స్తోత్రాలు పఠించడం ద్వారా ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని పేర్కొంటున్నారు.

ప్రసిద్ధ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు

రాహు–కేతు దోష నివారణకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజల వల్ల దోషాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. అలాగే ఉమ్మడి కృష్ణాజిల్లాలోని మోపిదేవి, సింగరాయపాలెంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో కూడా ఈ దోష నివారణకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

దానధర్మాలతో ఉపశమనం

పేదలు, అవసరమైనవారికి సహాయం చేయడం, దానధర్మాలు చేయడం వల్ల రాహు–కేతు దోష ప్రభావం గణనీయంగా తగ్గుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా అమావాస్య రోజున చేసే సేవలు శుభఫలితాలను ఇస్తాయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

Read Also: జీలకర్ర నీటితో కొవ్వు కరుగుతుందా? అసలు రహస్యం ఇది..!

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>