epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కవితపై జగ్గారెడ్డి ఫైర్​

కలం, వెబ్​ డెస్క్​ : కవిత(Kavitha).. కేసీఆర్​ కూతురు కాబట్టి లీడరయ్యింది.. కానీ, తాను వ్యక్తిగతంగా ఎదిగానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jagga Reddy) తెలిపారు. ఆదివారం హైదరాబాద్​ గాంధీ భవన్​ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్​ఎస్​ ను వీడడానికి కారణం హరీశ్​ రావు అని కవిత చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కవిత ఇప్పటికైనా ఇలాంటి ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. హరీశ్ రావుది వెనక నుంచి పొడిచే రాజకీయం అని విమర్శించారు. ఉమ్మడి మెదక్​ జిల్లాలో హరీశ్​ రావు తాను ఎప్పుడూ కొట్లాడుతూనే ఉంటామన్నారు.

హరీశ్​ రావు(Harish Rao) మీద కోపంతో కాంగ్రెస్​ పార్టీలోకి రాలేదని స్పష్టం చేశారు. పార్టీలోకి రావడానికి వైఎస్సార్(YSR)​ కారణమని స్పష్టం చేశారు. తాను కొంత డిస్ట్రబ్ అయ్యానని.. టైం వచ్చినప్పుడు అన్నీ చెబుతానని జగ్గారెడ్డి(Jagga Reddy) అన్నారు. ముఖ్యమంత్రి అవుతానని ఎవరైనా అంటే సిగ్గుగా ఉందని చెప్పారు. ప్రచార కమిటీ చైర్మన్​ పదవి మీద కూడా ఆసక్తిగా లేదని జగ్గారెడ్డి వెల్లడించారు.

 Read Also: మల్లయ్య కుటుంబానికి కేటీఆర్ కీలక హామీ

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>