epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

‘ఓట్​ చోరీ’ ప్రజలందరి సమస్య: సీఎం రేవంత్​ రెడ్డి

కలం, వెబ్​డెస్క్​: ఓట్​ చోరీ కేవలం కాంగ్రెస్​ పార్టీ సమస్య కాదని, ప్రజలందరి సమస్య అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఆదివారం ఢిల్లీలోని రామ్​లీలా మైదానంలో జరిగిన ‘ఓట్​చోరీ మహాధర్నా’ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఓటు అనేది అంబేద్కర్​ రాజ్యాంగం ద్వారా భారతీయులందరికీ కల్పించిన హక్కు అని రేవంత్​ అన్నారు. ఇప్పుడా హక్కును ప్రజల నుంచి, ముఖ్యంగా పేదల నుంచి దూరం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఓటు హక్కు కోల్పోతే ఆధార్​, రేషన్​ కార్డు, భూమి అన్నీ కోల్పోతామని హెచ్చరించారు.

ఈ దేశం మూలవాసులైన ఆదివాసీల ఓటునూ తొలగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. దళితులు, ఆదివాసీ, పేదలకు ఓటు హక్కు ఇవ్వడాన్ని ఆర్​ఎస్​ఎస్​ వ్యతిరేకించిందని గుర్తుచేశారు. ‘గత ఎన్నికల్లో 400 సీట్లు రాకపోవడంతో ‘సర్’​ పేరుతో ఓట్​ చోరీ(Vote Chori)కి బీజేపీ తెరతీసింది. దళిత, మైనారిటీ, ఆదివాసీల ఓట్లు తొలగించేందుకు కుట్ర చేస్తోంది. రాజ్యాంగం మార్చేందుకు ప్రయత్నిస్తోంది. దీనిపై కాంగ్రెస్​ పార్టీ పోరాడుతోంది. రాహుల్​ గాంధీ(Rahul Gandhi) అలుపెరగని సైనికులా పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో రాహుల్​ గాంధీకి మనం అందరంగా అండగా ఉండాలి.’ అని రేవంత్​ రెడ్డి(Revanth Reddy) పిలుపునిచ్చారు.

 Read Also: మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం : రాహుల్​ గాంధీ

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>