epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రామేశ్వరం కేఫ్‌లో కేటీఆర్​, అఖిలేశ్​ లంచ్​ మీట్​

కలం, వెబ్​ డెస్క్​ : సమాజ్​ వాది పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్​ యాదవ్ (Akhilesh Yadav)​.. మాజీ మంత్రి కేటీఆర్​ (KTR) తో కలిసి హైదరాబాద్​ లోని రామేశ్వరం కేఫ్ (Rameswaram Cafe) ​లో లంచ్​ చేశారు. కేఫ్​ రుచులను ఆస్వాదిస్తూ ఇద్దరు నేతలు రాజకీయ చర్చలు జరిపారు. అఖిలేశ్​ హైదరాబాద్​ పర్యటనలో భాగంగా శుక్రవారం కేటీఆర్​ నందినగర్​ నివాసంలో బీఆర్​ఎస్​ నేతలు హరీశ్​ రావు, తదితరులతో సమావేశం అయ్యారు. శనివారం ఉదయం ఓ కార్యక్రమంలో పాల్గొన్న అఖిలేశ్.. కేటీఆర్​ తో కలిసి లంచ్​ కోసం రామేశ్వరం కేఫ్​ కు వెళ్లారు. అక్కడ ఇద్దరు టిఫిన్​ తింటూ రాజకీయ, సమాకాలీన అంశాలపై కాసేపు ముట్టటించారు. అఖిలేశ్​, కేటీఆర్​ రాక సందర్బంగా రామేశ్వరం కేఫ్​ యజమాని వారిద్దరికి ఘనస్వాగతం పలికి ఏర్పాట్లు చేశారు.

దక్షిణాది టిఫిన్స్​ కు రామేశ్వరం కేఫ్​ పేరొందింది. దీంతో అఖిలేశ్​ యాదవ్​ ఇక్కడ తినడానికి ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేటీఆర్(KTR)​, అఖిలేశ్​ యాదవ్​ల లంచ్​ మీట్​ సోషల్​ మీడియాలో వైరల్​ గా మారడంతో వీరిద్దరి భేటి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. శనివారం ఉదయం హోటల్​ తాజ్​ కృష్ణలో సమాజ్​ వాది పార్టీ ఆధ్వర్యంలో విజన్​ ఇండియా సమ్మిట్​ నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా జరిగిన ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అఖిలేశ్​ యాదవ్​ హైదరాబాద్​ పర్యటనకు వచ్చారు. మొదటి సమావేశం బెంగళూరులో జరగగా రెండో సమ్మిట్​ కు హైదరాబాద్​ వేదికయ్యింది. సమావేశం ముగిసిన అనతరం కేటీఆర్​ అఖిలేశ్​ యాదవ్​ కలిసి రామేశ్వరం కేఫ్​ లో లంచ్​ చేశారు. అనంతరం అక్కడి నంచి కేటీఆర్​, అఖిలేశ్​ యాదవ్​ బీఆర్​ఎస్​ మాజీమంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ ఇంటికి వెళ్లారు.

Read Also: ఏఐ టెక్నాలజీతో బీజేపీని ఓడిస్తాం : అఖిలేశ్​ యాదవ్​

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>