epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఏడాది పొడవునా విమాన టికెట్​ రేట్లు నియంత్రించలేం: రామ్మోహన్​ నాయుడు

కలం, వెబ్​డెస్క్​: ఏడాది పొడవునా విమాన టికెట్​ రేట్లు నియంత్రించడం సాధ్యం కాదని, అసాధారణ పరిస్థితుల్లో కేంద్రం జోక్యం చేసుకుటుందని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్​ నాయుడు (Ram Mohan Naidu) అన్నారు. పండుగలు, సెలవు దినాల్లో రేట్లు సహజంగానే పెరుగుతాయని చెప్పారు. దేశంలో విమాన టికెట్ల రేట్లను నియంత్రించాలని కోరుతూ వచ్చిన తీర్మానంపై శుక్రవారం లోక్​సభలో మంత్రి మాట్లాడారు. ‘డీరెగ్యులేషన్​ (నియంత్రణ లేకపోవడం) అసలు ఉద్ధేశ్యం విమాన రంగం అభివృద్ధి. ప్రపంచంలోని అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లోనూ విమానయాన మార్కెట్​లో డీరెగ్యులేషన్​ విధానం ఉంది. మరిన్ని కంపెనీలు రావడానికి, పోటీ పెరగడానికి ఇది సాయపడుతుంది. మార్కెట్​ డీరెగ్యులేషన్​ వల్ల సరఫరా, డిమాండ్​ సహజంగా పనిచేస్తాయి. ఫలితంగా ప్రయాణికులకే మేలు జరుగుతుంది.

దీని కారణంగానే పండగలు, సెలవు దినాల్లో మాత్రమే టికెట్​ రేట్లు పెరుగుతాయి. దుర్గాపూజ, ఓనం, దీపావళి, క్రిస్మస్​ వంటి సమయాల్లో ప్రయాణికుల తాకిడి ఎక్కువ కాబట్టి ధరలు ఎక్కువవుతాయి. ఆ తర్వాత తగ్గుతాయి. ఇది సహజ ప్రక్రియ. అయితే, డీరెగ్యులేషన్​ కంపెనీల హక్కు కాదు. దానిపై కేంద్రం నియంత్రణ ఉంటుంది. కోవిడ్​, ఇటీవలి ఇండిగో సంక్షోభం లాంటి అసాధారణ పరిస్థితుల్లో కేంద్రం కచ్చితంగా జోక్యం చేసుకుంటుంది. టికెట్​ రేట్లు నియంత్రిస్తుంది. ఇదే విధానాన్ని ప్రస్తుతం అమలు చేశాం. అయితే, ఏడాది పొడవునా టికెట్ రేట్లపై నియంత్రణ విధించలేం’ అని రామ్మోహన్​ నాయుడు (Ram Mohan Naidu) అన్నారు.

Read Also: జనాభా లెక్కల సేకరణకు రూ. 11,718 కోట్ల కేటాయింపు

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>