epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

భద్రాద్రిలో పొలిటికల్ ట్విస్ట్.. BRSతో ఫైట్… TDPకి కాంగ్రెస్ రెబల్స్ సపోర్ట్

కలం, ఖమ్మం బ్యూరో : పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) వేళ భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా మణుగూరు మండలం సమితి సింగారం గ్రామంలో ఉద్రిక్తత నెల కొన్నది. పోలింగ్ కేంద్రం వద్ద అధికార కాంగ్రెస్ (Congress), బీ‌ఆర్‌ఎస్(BRS) శ్రేణుల మధ్య వాగ్వాదం చెలరేగడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కాగా, పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని బీఆర్ఎస్, టీడీపీ (TDP) శ్రేణులు గొడవకు దిగాయి. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య కొద్ది సేపు వాగ్వాదం జరిగింది.

పంచాయతీ పోలింగ్ (Panchayat Elections) కేంద్రాల వద్ద నిబంధనలను అతిక్రమించి కాంగ్రెస్ నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు (Rega Kantha Rao) అసహనం వ్యక్తం చేశారు. అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు సక్రమంగా తమ విధులు నిర్వహించాలన్నారు. మరోపక్క టీడీపీ మద్ధతు ఇస్తున్న సర్పంచ్ అభ్యర్ధి బచ్చల భారతి కి పోలీసులకు మధ్య కొద్ది సేపు వాగ్వాదం జరిగింది. సమితి సింగారం సర్పంచ్ అభ్యర్థి అయిన బచ్చల భారతి కి కాంగ్రెస్ రెబల్స్ మద్దతు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎమ్మెల్యే వర్గీయులకు భారతి వర్గీయులకు మధ్య విద్వేషాలు నెలకొన్నాయి. కాగా 11గంటల వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 52.25 శాతం పోలింగ్ నమోదు అయింది.

Read Also: షాకింగ్.. 50 శాతం US గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు నిల్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>