కలం, వెబ్డెస్క్: భారత్లో మైక్రోసాఫ్ట్ 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి (Microsoft Invests) పెట్టనుంది. భారత్లో ఏఐ విస్తరణ, అభివృద్ధికి ఈ నిధులు వాడతారు. ఈ మేరకు ప్రధానమంత్రి మోదీతో మంగళవారం జరిగిన భేటీ అనంతరం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల(Satya Nadella) తన ‘ఎక్స్’ ఖాతాలో ప్రకటించారు. ‘ భారత్లో ఏఐ రంగంపై ప్రధానమంత్రి మోదీతో స్ఫూర్తిదాయక చర్చ జరిగింది. భారత్ ఆశయాలకు, ఆకాంక్షలకు మద్దతుగా మైక్రోసాఫ్ట్ రూ.17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతుంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడి. ఏఐ అభివృద్దికి కావల్సిన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలు, స్వావలంబన వంటి వాటికి ఈ పెట్టుబడి ఉపకరిస్తుంది’ అని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని, పీఎంవో ‘ఎక్స్’ ఖాతాలను ఆయన ట్యాగ్ చేశారు.
కాగా, దేశంలో ఏఐ పరంగా డిజిటల్ వర్క్ఫోర్స్ పెంచడానికి డేటా సెంటర్లు, క్లౌడ్ సామర్థ్యం, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అవసరం. అలాగే భారీస్థాయి కంప్యూటర్ ఇన్ఫ్రాస్టక్చర్ కూడా కావాలి. ఏఐలో స్వావలంబన సాధించాలంటే దేశీయంగానే కంప్యూటర్ వినియోగ సామర్థ్యం మెరుగుపర్చడం, స్థానిక అవసరాలకు అనుగుణంగా మోడళ్లు తయారుచేయడం, డేటాను దేశంలోనే నిల్వచేయడం ముఖ్యమని నిపుణులు ముందుగానే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి అనుగుణంగా ఇప్పుడు భారీ పెట్టుబడితో(Microsoft Invests) మైక్రోసాఫ్ట్ ముందుకు రావడం దేశ ఏఐ రంగానికి అతిపెద్ద తోడ్పాటు దొరికిందని భావిస్తున్నారు.
Read Also: తెలంగాణ విజన్ అద్భుతం: ఆనంద్ మహీంద్రా
Follow Us On: Youtube


