epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

భారత బియ్యంపైనా టారిఫ్స్​!

కలం, వెబ్​డెస్క్​: అమెరికా రైతులకు, వ్యవసాయ రంగానికి ఇబ్బందికరంగా మారిన వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువుల దిగుమతులు.. ముఖ్యంగా భారత్​ నుంచి వస్తున్న బియ్యంపై టారిఫ్స్ ​(Rice Tariffs) విధించేందుకు అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్​ సిద్ధమవుతున్నారు. అమెరికాలోని రైతుల సంక్షేమం కోసం ఉద్దేశించిన మిలియన్​ డాలర్ల ప్యాకేజీని సోమవారం ఆయన విడుదల చేశారు. అనంతరం అక్కడి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలోకి వస్తున్న బియ్యం దిగుమతుల వల్ల ఇబ్బంది పడుతున్నట్లు స్థానిక రైతులు కొందరు ట్రంప్​ దృష్టికి తీసుకొచ్చారు.

దీనిపై స్పందించిన ట్రంప్​(Trump).. వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువుల దిగుమతిపై టారిఫ్స్ (Rice Tariffs)​ విధించనున్నట్లు చెప్పారు. ‘భారత్​ లాంటి ఆసియా దేశాల నుంచి బియ్యం ఇబ్బడిముబ్బడిగా అమెరికాకు వచ్చి పడుతోంది. అలాగే కెనడా నుంచి ఎరువులు వస్తున్నాయి. అమెరికా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వీటిపై టారిఫ్స్​ విధించే ఆలోచన చేస్తున్నాం’ అని ట్రంప్​ అన్నారు. కాగా, ఇప్పటికే విద్యార్థి, వృత్తి నిపుణుల వీసాలపై కఠిన నిబంధనలు తెచ్చిన ట్రంప్​.. రష్యా ఆయిల్​ను కొంటోందంటూ భారత్​పై సుంకాలూ విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భారత్​ నుంచి వచ్చే బియ్యంపైనా టారిఫ్స్​ వేస్తామని వార్నింగ్​ ఇవ్వడం మనదేశ వ్యవసాయ ఉత్పత్తులపై ప్రభావం చూపనుంది.

Read Also: జపాన్ లో భూకంపం.. ప్రభాస్ సేఫ్టీపై డైరెక్టర్ క్లారిటీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>