epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

యాపిల్​, గూగుల్​ సైబర్​ థ్రెట్​ అలర్ట్​

కలం, వెబ్​ డెస్క్​: యాపిల్​, గూగుల్​ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని తమ వినియోగదారులకు సైబర్​ థ్రెట్(Cyber Threat)​ అలెర్ట్స్​​ ​ పంపాయి. హ్యాకింగ్​, నిఘాకు గురయ్యే ప్రమాదముందంటూ హెచ్చరించాయి. ఈ నెల 2,3న ఈ అలెర్ట్​ నోటిఫికేషన్స్​ పంపినట్లు తెలిసింది. సాధారణంగా ఈ కంపెనీలూ తరచూ తమ వినియోగదారులకు ఇలాంటి నోటిఫికేషన్స్​ పంపడం మామూలే. అయితే, ప్రస్తుతం పంపిన నోటిఫికేషన్స్​ పై మరింత దర్యాప్తు జరగొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలెర్ట్​ నోటిఫికేషన్స్​ పంపినట్లు యాపిల్​ అంగీకరించినప్పటికీ ఎవరు నిఘా పెడుతున్నారు? ఎంత మంది వినియోగదారులను లక్ష్యంగా ఎంచుకున్నారు? వంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు.

Cyber Threat | గూగుల్​ మాత్రం ఇంటలెక్సా స్పైవేర్​ గురించి తమ వినియోగదారుల్లో కొంతమందిని హెచ్చరించినట్లు చెప్పింది. ఇందులో పాకిస్థాన్​, కజకిస్థాన్​, అంగోలా, ఈజిప్ట్​, ఉజ్బెబికిస్థాన్​, సౌదీ అరేబియా, తజకిస్థాన్​ తదితర దేశాల్లోని వందలాది మందికి నోటిఫికేషన్​ పంపినట్లు తెలిపింది. ఇంటలెక్సా అనేది ఇజ్రాయెల్​ కు చెందిన కంపెనీ. ఇది అమెరికా నుంచి పనిచేస్తోంది.

Read Also: దీనావస్థలో కేసీఆర్.. సర్పంచ్‌లను ఇంటికి పిలుస్తుండు..

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>