కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (kavitha) కుటుంబ సమేతంగా రేపు తిరుమలకు వెళ్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఫ్యామిలీతో కలిసి బయలుదేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కొండపైకి వెళ్తారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామి వారిని దర్శించుకుంటారు. త్వరలోనే కొత్త పార్టీ పెడుతున్న నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకోవడం చర్చనీయాంశంగా మారింది.

