epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

భారత్ పర్యటనకు పుతిన్.. షెడ్యూల్ ఇదే..

భారత్ పర్యటించడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) సిద్ధమయ్యారు. ఈ టూర్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను రష్యా అధ్యక్ష కార్యాలయం అధికారికంగా విడుదల చేసింది. డిసెంబర్ 4, 5 తేదీల్లో ఆయన పర్యటన జరగనుంది. 2021 తర్వాత పుతిన్ భారత్‌కు రావడం ఇదే తొలి సారి. పలు దేశాలపై అమెరికా టారిఫ్‌లు విధిస్తున్న సమయంలో పుతిన్ భారత్ పర్యటనకు విశేష ప్రాధాన్యం వచ్చింది.

2024 జులైలో జరిగిన శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ(PM Modi) రష్యాను సందర్శించారు. ఈ సందర్భంగా ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్’ను మోదీ అందుకున్నారు. తాజాగా ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు పుతిన్(Vladimir Putin) భారత్ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశముంది.

భవన నిర్మాణం, జవళి, ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో రష్యాలో నిపుణుల కొరత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 70 వేల మందికి పైగా భారతీయ కార్మికులు, నిపుణులకు అక్కడ ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read Also: ఆ దేశాల నుంచి వలసలకు అమెరికా ఫుల్‌స్టాప్..

Follow Us On : Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>