కలం, నల్లగొండ బ్యూరో: సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా మంగళవారం యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీ నరసింహ స్వామి (Lakshmi Narasimha Swamy) ఆలయాన్ని మూసివేయనున్నట్టు ఆలయ ఈఓ భవాని శంకర్ వెల్లడించారు. ఉదయం 7 గంటల నుండి బుధవారం ఉదయం 3 గంటల వరకు ఆలయం మూసివేయనున్నారు. ఉదయం 3 గంటలకు ఆలయాన్ని తెరిచి గ్రహణ దోష పరిహారార్థం ఆలయ అర్చకులు సంప్రోక్షణ ఆలయ శుద్ధి చేయనున్నారు. సంప్రోక్షణ ఆలయ శుద్ధి అనంతరం నిత్య పూజలు నిర్వహించి భక్తులను స్వామి వారి దర్శనాలకు ఆలయ అధికారులు అనుమతించనున్నారు. భక్తులు గమనించి సహకరించాలని కోెరారు.
Read Also: ఫినో బ్యాంక్ సీఈవో రిషి గుప్తా అరెస్ట్..!
Follow Us On: Pinterest

