కలం, వరంగల్ బ్యూరో: ములుగు (Mulugu) జిల్లా మల్లంపల్లి మండలం మహమ్మద్ గౌస్పల్లిలో శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్–ములుగు జాతీయ రహదారిపై కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తి (Biker) కాలు పాదం తెగిపడింది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

