మహమ్మద్ గౌస్‌పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెగిపడ్డ బైకిస్ట్ కాలు పాదం

కలం, వరంగల్ బ్యూరో: ములుగు (Mulugu) జిల్లా మల్లంపల్లి మండలం మహమ్మద్ గౌస్‌పల్లిలో శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్–ములుగు జాతీయ రహదారిపై కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తి (Biker) కాలు పాదం తెగిపడింది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>