కలం మెదక్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలోని సురభి మెడికల్ కాలేజీ (Surabhi Medical College) లో చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు చేసుకుంది. ఫిజియోథెరపీ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీజ హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుంది. మృతురాలు శ్రీజ పెద్దపెల్లి (Peddapalli) జిల్లా శ్రీరాంపూర్ మండలం మెడిపెల్లి గ్రామానికి చెందినదిగా గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
Read Also: కుమ్మెర ఘటన.. నడిరోడ్డుపై మాజీ ఎమ్మెల్యే ఆందోళన
Follow Us On: Instagram


