కలం, స్పోర్ట్స్: ప్రస్తుత టీ20 ప్రపంచకప్లో (T20 World Cup) అభిషేక్ శర్మ (Abhishek Sharma) గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. అమెరికా, పాకిస్థాన్, నమీబియాతో జరిగిన మూడు గ్రూప్ దశ మ్యాచ్ల్లోనూ ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో మాజీ సెలక్టర్ సబా కరీం (Saba Karim) ఆయనకు కీలక సూచనలు చేశారు. అభిషేక్ బలహీనతలను దక్షిణాఫ్రికా బౌలర్లు ఖచ్చితంగా గమనిస్తారని, అందుకు తగ్గట్లుగా వారు సిద్ధమవుతారని కరీం హెచ్చరించారు. ఈ క్లిష్ట స్థితి నుంచి బయటపడాలంటే అభిషేక్ తన బ్యాటింగ్ శైలిలో కొంత సహనం ప్రదర్శించాలని ఆయన కోరారు. మొదటి బంతి నుంచే 200 పైచిలుకు స్ట్రైక్ రేట్తో ఆడాలనే ఒత్తిడిని పక్కన పెట్టి, క్రీజులో కొంత సమయం గడపాలని సూచించారు.
ముఖ్యంగా ఒకటి రెండు ఓవర్లు నిలదొక్కుకుంటే, ఆ తర్వాత సులభంగా పరుగులు రాబట్టవచ్చని కరీం విశ్లేషించారు. తన సహజ సిద్ధమైన దూకుడును మార్చుకోవాల్సిన అవసరం లేదని, అయితే పరిస్థితులకు తగ్గట్టుగా గేమ్ను మలచుకోవాలని ఆయన పేర్కొన్నారు. మరోవైపు అభిషేక్ భాగస్వామి ఇషాన్ కిషన్ అద్భుత ఫామ్లో ఉన్నారు. మూడు ఏళ్ల విరామం తర్వాత జట్టులోకి వచ్చిన ఇషాన్, ఈ టోర్నీలో 202 స్ట్రైక్ రేట్తో 176 పరుగులు సాధించారు. ఒకవేళ అభిషేక్ (Abhishek Sharma) కూడా ఫామ్లోకి వస్తే, పవర్ప్లేలో భారత్కు తిరుగులేని ఆరంభం లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also: అభిషేక్ వైఫల్యానికి అతడి స్టైలే కారణం: ఇర్ఫాన్ పఠాన్
Follow Us On: Instagram


