కలం, డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) రేపు ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో (AI Impact Summit) సీఎం చంద్రబాబు పాల్గొనబోతున్నారు. ఈ రోజు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ ఈ సమ్మిట్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సమ్మిట్ కు దేశ విదేశాల నుంచి ప్రతినిధులు వచ్చి స్టాళ్లను ఏర్పాటు చేశారు. మొదటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు ఏఐ ప్రాముఖ్యత గురించి చెబుతున్న నేపథ్యంలో.. ఈ సమ్మిట్ కు వెళ్లి మరింత లోతుగా ఏఐ ఆవశ్యకతను అర్థం చేసుకుంటారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Read Also: హెరిటేజ్కు ఇందాపూర్ కో ప్రొడక్ట్స్: మంత్రి సత్యకుమార్
Follow Us On: Pinterest


