కలం, డెస్క్ : తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయాన్ని మార్చి 3న మూసేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఈ మేరకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రకటన రిలీజ్ చేశారు. మార్చి 3న సాయంత్రం 3.20 గంటల నుంచి 6.47 గంటల దాకా చంద్రగ్రహణం ఉన్నందున ఉదయం 9 గంటల నుంచే ఆలయం మూసి ఉంటుందని చెప్పారు. అదే రోజు కుమారధార తీర్థ ముక్కోటి ఉత్సవాలు జరుగుతాయని.. వాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్లాన్ చేస్తున్నట్టు వివరించారు. కాబట్టి ఈ విషయాన్ని భక్తులు గమనించి సహకరించాలని కోరారు.
Read Also: మేఘా కంపెనీలోకి జేడీ లక్ష్మీనారాయణ.. జనసేన ప్రశ్నలు..
Follow Us On: Instagram


