కలం, డెస్క్ : హైదరాబాద్ పరిధిలో వరుస దొంగతనాలు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 30 తులాల బంగారం చోరీ (Gold Theft) సంచలనంగా మారింది. బేగంపేట శ్యామ్ లాల్ పరిధిలో ఓ వృద్ధురాలు నివసిస్తున్నారు. ఆమె శివరాత్రి సందర్భంగా తన కూతురు ఇంటికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి 30 తులాల బంగారం చోరీ చేశారు. ఓ బిల్డింగ్ లోని మూడో అంతస్తులో ఆమె నివసిస్తోంది. ఎవరూ లేనిది చూసి తాళాలు పగలగొట్టి చోరీ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో అన్నీ రికార్డు అయ్యాయని.. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.


