కలం, వెబ్డెస్క్: పాకిస్థాన్ స్పిన్ దెబ్బకు భారత్ తడబడింది (Pakistan – India). దాయాది దేశంతో ఆదివారం కొలంబో వేదికగా జరుగుతున్న మ్యాచ్లో నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లకు 175 పరుగులు చేసింది. మ్యాచ్లో పాక్ స్పిన్ మాయాజాలం పని చేసిందనే చెప్పుకోవాలి. భారత బ్యాటర్లు వారి స్పిన్కు వికెట్లు సమర్పించుకున్నారు. ఫలితంగా భారత ఇన్నింగ్స్ కొంచెం నత్తనడకనే సాగింది. భారత బ్యాటర్లు బౌండ్రీలతో విరుచుకుపడతారని, పాక్ స్పిన్నర్లకు చుక్కలు చూపిస్తారని కలలు కన్న అభిమానులకు నిరాశే మిగిలింది. దానికి తోడు హిట్టర్స్ అనిపించుకున్న వాళ్లలో ఇషాన్ మినహా మిగిలిన ఏ బ్యాటర్ కూడా ఆశించిన స్థాయి ఇన్నింగ్స్ ఆడలేదు.
తొలుత అభిషేక్ శర్మ (Abhishek Sharma) డకౌట్తో మొదటి వికెట్ పడింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 77 పరుగులు చేశాడు. సైమ్ ఆయుబ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత తిలక్ వర్మతో కలిసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ కొద్ది సేపటికే తిలక్ వర్మ్ 24 బంతుల్లో 25(2 ఫోర్లు, 1సిక్స్) పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టాడు.
ఆ తర్వాత క్రీజ్లోకి అడుగు పెట్టిన పాండ్యా గోల్డెక్ డకౌట్ అయ్యాడు (Pakistan – India). తొలి బంతికే బాది పారేద్దామన్నట్లు గాల్లోకి లేపగా అది కాస్తా క్యాచ్ అయింది. బాబర్ అజామ్ క్యాచ్తో పాండ్యా కూడా పెవిలియన్కు చేరుకున్నాడు. దీంతో శివమ్ దూబే స్టేడియంలోకి అడుగు పెట్టాడు. ఈ క్రమంలో రెండు వైపులా స్పిన్నర్లను దించడంతో భారత్ స్కోరు నెమ్మదించింది. పాక్ మిస్టరీ స్పిన్నర్ తారిఖ్ వేసిన 19 ఓవర్లో భారీ షాట్ కొట్టబోయి సూర్య(32; 29 బంతుల్లో 3 ఫోర్లు) అవుటయ్యాడు. షాహిన్ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో రింకూ సింగ్(11 నాటౌట్; 4 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టడంతో భారత్ స్కోరు 175కు చేరింది. అయితే, ఇదే ఓవర్లో శివమ్ దూబె, అక్షర్ పటేల్ వికెట్లను కోల్పోయింది.
పాక్ బౌలర్లలో సయీమ్ అయూబ్ 4 ఓవర్ల బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత సల్మాన్ అఘా రెండు ఓవర్ల బౌలింగ్లో 10 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఉస్మాన్ తారిఖ్, షాహీన్ అఫ్రిది చెరో వికెట్ తీసుకున్నారు. పాకిస్థాన్ 176 పరుగులను భారత్ టార్గెట్గా పెట్టింది.
Read Also: ప్రధాని మోడీపై వ్యంగ్య వ్యాఖ్య? నటి తాప్సి వీడియో వైరల్
Follow Us On: X(Twitter)


