కలం, వెబ్ డెస్క్: ప్రముఖ నటి తాప్సి పన్ను(Taapsee Pannu)కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆమె చేసిన వ్యాఖ్యలు బీజేపీ శ్రేణులకు తీవ్ర కోపం తెప్పిస్తున్నాయి. ఈ దేశంలో స్వేచ్ఛ లేదు అన్నట్టుగా నటి తాప్సి ప్రవర్తించారు. అసలేం జరిగింది? తాప్సీ చేసిన కామెంట్లు ఏమిటి? ఈ కథనంలో చూద్దాం..
తాప్సి పన్ను ఇటీవల ఓ న్యూస్ చానల్ ఇంటర్వ్యూకు వెళ్లారు. ఇంటర్వ్యూ సమయంలో యాంకర్ ర్యాపిడ్ ఫైర్లో భాగంగా ప్రశ్నలు అడిగారు. ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ ఇద్దరి ఫొటోలు చూపించి ఏ నేత అంటే ఇష్టమని అడిగారు.
ఈ ప్రశ్నకు తాప్సీ (Taapsee Pannu) ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ప్రధాని మోడీ అని వెంటనే సమాధానమిచ్చింది. ‘నేను ఇంకా ఈ దేశంలోనే ఉండాలని అనుకుంటున్నా’ అందుకే అలా చెప్పాను అంటూ ఆమె వ్యాఖ్యానించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు తాప్సి పన్ను ధైర్యాన్ని మెచ్చుకుంటుండగా.. బీజేపీ అనుకూల నెటిజన్లు మీద తాప్సీ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాప్సి పన్ను అలా వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదంటున్నారు.


