కలం, వెబ్ డెస్క్ : ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై విస్తృతంగా చర్చ జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ప్రియాంక గాంధీ సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు సంతృప్తి చెందారని, దాని ప్రభావమే కాంగ్రెస్ పార్టీకి ఈ ఘన విజయం తెచ్చిపెట్టిందని రేవంత్ తెలియజేశారు.
Read Also: ఉత్కంఠభరితంగా నిజామాబాద్ కార్పొరేషన్ ఫలితాలు
Follow Us On: Instagram


