కలం, వెబ్ డెస్క్ : నిజామాబాద్ (Nizamabad Corporation) మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం మధ్య హోరాహోరీ పోరు నెలకొనడంతో ఫలితాల సరళిపై ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ మూడు పార్టీలు కూడా విజయం కోసం నువ్వా నేనా అన్నట్లుగా దూసుకుపోతున్నాయి.
ప్రస్తుత గణాంకాల ప్రకారం బీజేపీ అధిక స్థానాల్లో ముందంజలో ఉంది. ఆ పార్టీ 19 స్థానాల్లో లీడ్ సాధించడమే కాకుండా 3 స్థానాల్లో విజయం సాధించింది. ఈ కార్పొరేషన్ పై బీజేపీ భారీ ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్, ఎంఐఎం కూడా గట్టి పోటీని ఇస్తూ సమీపంలోనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా 2 స్థానాల్లో తన గెలుపును ఖాయం చేసుకుంది. అదేవిధంగా ఎంఐఎం 8 స్థానాల్లో లీడ్ సాధించి 2 స్థానాల్లో విజయం సాధించింది.
ప్రస్తుతానికి బీజేపీ అధిక స్థానాల్లో ముందంజలో ఉన్నప్పటికీ గెలిచిన స్థానాల పరంగా మూడు పార్టీల మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా కనిపిస్తోంది. దీంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందనే అంశంపై ప్రజల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఫలితాల సరళి ఎప్పటికప్పుడు మారుతుండటంతో నిజామాబాద్ కార్పొరేషన్ (Nizamabad Corporation) పీఠం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.


