epaper
Wednesday, February 18, 2026
epaper

రూ.3.25లక్షల కోట్లతో 114 రఫేల్​ జెట్స్​.. సెంటర్​ ఓకే

కలం, వెబ్​డెస్క్​: భారత అమ్ముల పొది మరింత బలోపేతం కానుంది. ఆపరేషన్​ సిందూర్​లో కీలక పాత్ర పోషించి, హీరోలా నిలిచిన రఫేల్​ జెట్స్​ను (Rafale Jets) మరిన్నింటిని కేంద్రం కొననుంది. ఈ మేరకు రూ.3.25లక్షల కోట్లతో 114 రఫేల్ జెట్స్​ కొనడానికి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిఫెన్స్​ అక్వైజేషన్​ కౌన్సిల్​(డీఏసీ) ఆమోదం తెలిపింది.

ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్​ మాక్రన్​ ఈ నెలలో భారత పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రక్షణ ఒప్పందాల్లో భాగంగా ఫ్రాన్స్​ నుంచి రఫేల్​ యుద్ధ విమానాలు కొనేందుకు​ భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు తయారుచేసి, ఆమోదానికి డీఏసీకి పంపింది. ఈ క్రమంలో రఫేల్​ జెట్స్​ కొనుగోలుకు ఆక్సెపెటెన్స్​ ఆఫ్​ నెసెసిటీ (ఏవోఎన్​)ను డీఏసీ మంజూరు చేసింది.

ప్రస్తుతం దేశ ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కొత్త రఫేల్​ జెట్స్ (Rafale Jets)​ భారత వాయుసేన సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి. భారత్​ ప్రతిపాదించిన మొత్తం 114 జెట్లలో 18ని ఫ్రాన్స్​లోనే తయారుచేసి భారత్​కు అందజేస్తారు. మిగిలిన 96ను భారత్​లోనే తయారుచేసేలా ఒప్పందం సిద్ధమైంది.

Read Also: ఇయర్‌ఫోన్ లేకుండా వింటున్నారా?.. అయితే శిక్ష తప్పదు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>