కలం, వెబ్డెస్క్: నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన మహారాష్ట్రలోని పుణేలో (Pune) జరిగింది. చనిపోయిన వ్యక్తిని ప్రముఖ వ్యాపారవేత్త, సోలాపూర్లోని ముల్తానీ బేకరీ ఓనర్ సునీల్ మోతీలాల్ సదరాంగని (Sunil Motilal Sadarangani) గా గుర్తించారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణేలోని విజాపూర్ రోడ్డు పక్కన కొత్తగా నిర్మిస్తున్న 17 అంతస్థుల బిల్డింగ్పైకి సునీల్ గురువారం సాయంత్రం చేరుకున్నాడు. అనంతరం కాసేపు అక్కడక్కడే తిరిగాడు.
సమీపంలోని ఇళ్ల నుంచి కొంతమంది ఈ విషయాన్ని గమనించి వీడియో తీశారు. సునీల్ ఉన్న బిల్డింగ్ వాచ్మ్యాన్కు సమాచారం ఇచ్చారు. వెంటనే అతను, మరో వ్యక్తి బిల్డింగ్ పైకి వెళ్లారు. సునీల్తో మాట్లాడి కిందకు తీసుకొస్తుండగా, పదో అంతస్థు వరకు వచ్చిన ఆయన ‘కారు తాళాలు పైనే మర్చిపోయానంటూ వెనక్కి పరిగెత్తాడు. బిల్డింగ్పైకి చేరుకోగానే ఒక్కసారిగా అక్కడి నుంచి కిందకు దూకేశాడు. వెనకాలే ఇద్దరూ వచ్చినప్పటికీ ఆపలేకపోయారు.
వాళ్లు వెంటనే కిందకు దిగి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం, తీవ్రంగా గాయపడిన సునీల్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన చనిపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సునీల్ మోతీలాల్ సదరాంగని (Sunil Motilal Sadarangani) కొన్నేళ్ల కిందట షోలాపూర్ నుంచి వచ్చి పుణేలో స్థిరపడ్డారు. కాగా, ఆత్మహత్యకు ముందు సునీల్ బిల్డింగ్పై ఉండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.
Read Also: U-19 ఫైనల్: విజృంభించిన వైభవ్.. 80 బంతుల్లో రికార్డ్..
Follow Us On: Sharechat


