epaper
Monday, February 2, 2026
spot_img
epaper

లోక్​సభను తాకిన ‘ఎప్​స్టీన్’​ సెగ

కలం, వెబ్​డెస్క్​: ప్రపంచాన్ని కుదిపేస్తున్న ‘ఎప్​స్టీన్​ సెక్స్​ స్కాండల్​’ (Epstein Files) వ్యవహారం లోక్​సభను తాకింది. ఈ కుంభకోణానికి సంబంధించి అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ‘ఫైల్స్​’లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరు ప్రస్తావనతోపాటు పీఎం హోదాలో ఆయన ఇజ్రాయెల్​కు వెళ్లిన పర్యటన వివరాలు ఉండడంపై ప్రభుత్వ వివరణ కోరుతూ కాంగ్రెస్​ వాయిదా తీర్మానం ఇచ్చింది. సోమవారం ఉదయం సభ ప్రారంభమైన కాసేపటికే కాంగ్రెస్​ ఎంపీ మాణిక్యం ఠాగూర్​ ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్​స్టీన్​ ఫైల్స్​లో ప్రధాని మోదీ ఇజ్రాయెల్​ పర్యటన వివరాలు ఉండడం ఆందోళనకరమన్నారు. ఇది దేశ అంతర్జాతీయ ప్రతిష్ఠ, నైతికత, రాజ్యంగ విశ్వసనీయతపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించారు.

“ ఎప్​స్టీన్​ ఫైల్స్​లో.. 2017 జులై 9న ఎప్​స్టీన్​ రాసినట్లుగా చెబుతున్న ఓ మెయిల్​లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్​, ఇజ్రాయెల్​​ పర్యటనకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఇది అంతర్జాతీయంగా భారత దౌత్య అంశాలపై ప్రభావం చూపిస్తుంది. అనేక ఊహాగానాలకు, ప్రశ్నలకు అవకాశమిస్తోంది. దీనిపై సభ మౌనంగా ఉండడం సరికాదు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన, కచ్చితమైన, అధికారిక వివరణ కావాలి’’ అని మాణిక్యం ఠాగూర్​ పేర్కొన్నారు.

‘ఎప్​స్టీన్​ పేరుతో వచ్చిన ఈ ఫైల్స్​లోని సమాచారం నిజమైనదని ప్రభుత్వం ధ్రువీకరిస్తోందా? అలాగే భారత ప్రధాని లేదా ప్రభుత్వంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆ నిందితునికి సంబంధం ఉందా?’ అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు.

కాగా, ఎప్​స్టీన్​ ఫైల్స్ (Epstein Files) ​లో ప్రధాని పేరు ప్రస్తావనపై అంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఖండించింది.  ‘2017 జూలైలో ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌కు వెళ్లిన అధికారిక పర్యటన వాస్తవం. కానీ, ఆ ఈ మెయిల్‌లో ఉన్న మిగిలిన అంశాలన్నీ ఒక నేరస్థుడి అర్థంలేని ఊహాగానాలే’ అని విదేశాంగ శాఖ మీడియా ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.

Read Also: తడిచెర్ల కోల్ బ్లాక్ కేటాయింపు.. రాజ్యసభలో ఎంపీ ప్రశ్న

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>